తమిళ హీరో సిద్ధార్థ్ 8 ఏళ్ళ తర్వాత తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. ఆరెక్స్ 100 డైరక్టర్ అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న మహా సముద్రం సినిమాలో శర్వానంద్ తో సిద్ధార్థ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. క్రేజీ మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ తన సత్తా చాటనున్నాడు. 8 ఏళ్ల తర్వాత సిద్ధార్థ్సినిమా చేస్తున్నారు.

ఇంత గ్యాప్ తర్వాత తెలుగులో మరో సినిమా చేయడంపై సిద్ధార్థ్ స్పెషల్ ట్వీట్ చేశారు. తెలుగులో 8 ఏళ్ళ తర్వాత నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు సిద్ధార్థ్. అజయ్ భూపతి ఈ సినిమా కోసం చాలామంది హీరోల దగ్గరకు వెళ్లాడు కాని వాళ్ళెవరు ఈ సినిమాను చేయనని చెప్పారు. ఫైనల్ గా శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. తప్పకుండా ఈ మల్టీస్టారర్ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ కానుంది.

నువ్వొస్తానంటే నేనొద్దంటా, బొమ్మరిల్లు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న సిద్ధార్థ్ అప్పట్లో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నా తర్వాత ఎందుకో తన మార్క్ సినిమాలు చేయడంలో వెనకపడ్డాడు. ఇక తెలుగులో ప్రస్తుతం మరో లక్కీ ఛాన్స్ రావడంతో మరోశారి ఇక్కడ తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. సిద్ధార్థ్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న మహా సముద్రం తప్పకుండా అతన్ని మునుపటి ఫాం తెచ్చేలా చేస్తుందని అంటున్నారి. మొదటి సినిమాతోనే సత్తా చాటిన అజయ్ భూపతి ఈ సినిమా కథ చాలా గ్రిప్పింగ్ తో రాసుకున్నాడని తెలుస్తుంది.    

                                                           


మరింత సమాచారం తెలుసుకోండి: