వివరాల్లోకి వెళ్తే.. కరోనా కారణంగా దాదాపుగా ఎనిమిది నెలలుగా షూటింగ్కు దూరంగా ఉన్న శ్రుతి హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఓ వైపు తెలుగులో చేస్తూనే తమిళంలో కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే ఇటీవలే ఆమె ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారట. అయితే ఆమె షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ప్యాకప్ చెప్పేసి మధ్యలోనే బయటకు వచ్చేశారట. కారణంమేంటని ఆరా తీస్తే ఆమె షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నవారు తండోపతండాలుగా వస్తున్నారట. దీంతో కరోనా భయంతో శ్రుతి హాసన్ సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోయిందట.
ప్రస్తుతం ఆమె హీరోయిన్గా నటిస్తోన్న సినిమా ‘లాభం’. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ తమిళ సినిమా క్లైమాక్స్కు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికే.. పరిసర ప్రాంత వాసులు భారీగా హాజరవుతున్నారని, అక్కడి సిబ్బంది కరోనా జాగ్రత్తలు ఏవీ తీసుకోవడం లేదని, అందుకే శ్రుతి హాసన్ బయటకు వచ్చేశారని అందరూ అనుకుంటున్నారు. ఆమె కూడా సిబ్బందిపై ఫైర్ అయ్యారట. షూటింగ్ చూడడానికి వస్తోన్న ప్రజలను కంట్రోల్ చేయలేకపోతే ఎలా?అని అసహనం వ్యక్తం చేశారట. ఈ విషయం గురించి ఆమె తన ట్వట్టర్లో ఇలా రాసుకొచ్చారు. `కరోనా అనేది చాలా ప్రమాదకరమైనది. అది ఇంకా అంతరించిపోలేదు. కరోనా ప్రోటోకాల్స్ పాటించని పక్షంలో.. ఓ మహిళగా, నటిగా నా భద్రత కోసం జాగ్రత్తలు తీసుకునే హక్కు నాకు ఉంది`అని ట్వీట్ చేసింది.