లక్ష్మీ పార్వతి ఏమి చేసినా అది సంచలనమే అందుకే ఆమె ఎప్పుడు చూసినా వార్తలలో ఉంటుంది. నిన్న నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి శ్రద్ధాంజలి ఘటించిన లక్ష్మీపార్వతి మీడియా వర్గాలతో మాట్లాడుతూ చేసిన ప్రకటన అత్యంత ఆశ్చర్యంగా మారిది. అంతేకాదు లక్ష్మీపారావతి చేసిన కామెంట్స్ నందమూరి ఫ్యామిలీ సభ్యులకు కూడ షాక్ ఇచ్చినట్లు సమాచారం.


నందమూరి తారకరామారావు  తన కుటుబం లో పుట్టాడు అంటూ ఆమె నిన్న ఒక సంచలన ప్రకటన చేసింది. తనకు మనవడు పుట్టాడు అని చెపుతూ తన మనవడు ‘లిటిల్ ఎన్టీఆర్’ అంటూ ఆమె కామెంట్ చేయడమే కాకుండా తన మనవడు కు ఎన్టీఆర్ ఆశిస్సులు ఉన్నాయని చెపుతూ ఎన్టీఆర్ స్పూర్తితో  తన మనవడు ఎదగడం ఖాయం అంటూ ఆమె చేసిన కామెంట్స్ మీడియాకు మాత్రమే కాకుండా రాజకీయ వర్గాలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సంచాల వార్తగా మారింది.


ఇప్పటి వరకు ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించే మనవల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న కళ్యాణ్ రామ్ మోక్షజ్ఞ లు ప్రధమ వరసలో నిలుస్తారు. అయితే ఇప్పుడు లక్ష్మీపార్వతి మనవడు కూడ ఈ లిస్టులో చేర్చడం ఒక విధంగా ఆశక్తి కలిగించే విషయం. ఎన్టీఆర్ ను పెళ్ళి చేసుకునే ముందు లక్ష్మీపార్వతి కి హరికథ కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావుతో పెళ్ళి జరిగింది. వారిద్దరికీ పుట్టిన కొడుకు ఇప్పుడు డాక్టర్ గా మారాడు. ఆయనకు ఇప్పుడు కొడుకు పుట్టడంతో ఆనందంలో పడ్డ లక్ష్మీపార్వతి తనకు పుట్టిన మనవడును లిటిల్ ఎన్టీఆర్ గా భావిస్తున్నారు.


వాస్తవానికి లక్ష్మీపార్వతి మనవడు ఏవిధంగా నందమూరి వంశానికి చెందుతాడు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఎన్టీఆర్ అర్థాంగి గా లక్ష్మీపార్వతి తన మనవడు లిటిల్ ఎన్టీఆర్ ను నందమూరి వంశ వారసుడు గా చేయడం ఎన్టీఆర్ 25వ వర్థంతి రోజున హైలెట్..  

మరింత సమాచారం తెలుసుకోండి: