ఇక ఈ
మూవీ ద్వారా తొలిసారిగా
తండ్రి మెగాస్టార్ తో కలసి నటిస్తున్నారు మెగాపవర్ స్టార్
రామ్ చరణ్.
కాజల్ అగర్వాల్,
పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి
మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా తిరు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ
మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఇటీవల కొన్నాళ్ల క్రితం ఈ
మూవీ నుండి
చిరంజీవి పాత్ర తాలూకు కొన్ని ఫోటోలు సోషల్
మీడియా లో లీక్ అయి సంచలనం సృష్టించాయి.
అవి మరిచిపోకముందే నేడు ఈ
మూవీ యొక్క సెట్స్ నుండి ఏకంగా చిరు తో పాటు చరణ్ ఇద్దరూ కూడా వైట్ షర్ట్స్ వేసుకుని ఉన్న ఒక ఫోటో లీక్ కావడం ఆపై అది సోషల్
మీడియా లో ఎంతో వైరల్ అవడం జరిగింది. దీనితో తలలు పట్టుకుంటున్న ఆచార్య యూనిట్, ఇకపై ఇటువంటి లీకుల బారిన తమ
సినిమా పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విధంగా సినిమాల్లోని నటుల ఫోటోలు లీక్ చేయడం మంచి
సంస్కృతి కాదని, ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకుని ఎన్నో కోట్ల రూపాయలతో ఎందరో కార్మికులు కష్టపడి పని చేసే సినిమాలను బ్రతికించాలని పలువురు
సినిమా ప్రముఖులు కోరుతున్నారు. అయితే కేవలం ఆచార్య మాత్రమే కాక పుష్ప, రాధేశ్యామ్, సర్కారు వారి పాట ఇలా దాదాపుగా చాలా సినిమాలు ఇటీవల లీకుల బారిన పడ్డ విషయం తెలిసిందే....!!