టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మెగా మూవీ సైరా నరసింహా రెడ్డి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఆ మూవీలో తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ నటనకు ప్రేక్షకాభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్.

ఇక ఈ మూవీ ద్వారా తొలిసారిగా తండ్రి మెగాస్టార్ తో కలసి నటిస్తున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా తిరు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఇటీవల కొన్నాళ్ల క్రితం ఈ మూవీ నుండి చిరంజీవి పాత్ర తాలూకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయి సంచలనం సృష్టించాయి. 

అవి మరిచిపోకముందే నేడు ఈ మూవీ యొక్క సెట్స్ నుండి ఏకంగా చిరు తో పాటు చరణ్ ఇద్దరూ కూడా వైట్ షర్ట్స్ వేసుకుని ఉన్న ఒక ఫోటో లీక్ కావడం ఆపై అది సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవడం జరిగింది. దీనితో తలలు పట్టుకుంటున్న ఆచార్య యూనిట్, ఇకపై ఇటువంటి లీకుల బారిన తమ సినిమా పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విధంగా సినిమాల్లోని నటుల ఫోటోలు లీక్ చేయడం మంచి సంస్కృతి కాదని, ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకుని ఎన్నో కోట్ల రూపాయలతో ఎందరో కార్మికులు కష్టపడి పని చేసే సినిమాలను బ్రతికించాలని పలువురు సినిమా ప్రముఖులు కోరుతున్నారు. అయితే కేవలం ఆచార్య మాత్రమే కాక పుష్ప, రాధేశ్యామ్, సర్కారు వారి పాట ఇలా దాదాపుగా చాలా సినిమాలు ఇటీవల లీకుల బారిన పడ్డ విషయం తెలిసిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: