ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా నాచురల్ గా వచ్చిన అందం కంటే ఆర్టిఫిషియల్ గా మరింత అందాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది మహిళలు అయితే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.  సహజ సిద్ధంగా వచ్చిన అందం చాలా బాగున్నప్పటికీ మరికాస్త అందంగా కనిపించాలనే ఉద్దేశంతో  మెడికల్ షాప్ లలో  దొరికే ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతున్నారు. మరి కొంత మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ..  అక్కడ ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇలా బ్యూటీ పార్లర్ కు వెళ్ళినప్పుడు ఉన్న అందం కంటే మరి కాస్త అందం పెరిగితే మంచిదే కానీ కొన్ని కొన్ని సార్లు ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది అంటే..  కొత్త అందం రావడం ఏమోకానీ ఉన్న అందం కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా తమ అందాన్ని  పంచుకోవడానికి ఏదో ఒకటి ట్రై చేసి చివరికి చేదు అనుభవం ఎదురుకున్న  వారు కూడా  ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వారు సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేశారు.  ఇక ఇటీవల ఒక సీరియల్ నటి కి కూడా ఇలాంటి ఒక చేదు అనుభవమే ఎదురైనట్లు  తెలుస్తుంది.



 అందాన్ని పెంచుకోవడానికి ఓ  బ్యూటీ క్లినిక్ కు వెళ్ళిన నటికి చివరికి చేదు అనుభవం ఎదురయ్యే  పరిస్థితి ఏర్పడింది. మరింత అందం గా మారడం కాదు ఉన్న అందం కూడా పోగొట్టుకునే గతి పట్టింది. ఏకంగా సహజ రంగును కోల్పోయింది ఆ నటి. ఈ  సంఘటన హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్ కాలనీ లో టీవీ నటి మేఘన లా వినో  కాస్మోటిక్ క్లినిక్ కి వెళ్ళింది.  తన అందం పెంచుకోవాలి అని ఏకంగా ఐదు రోజుల చికిత్స కోసం 62000 కట్టింది. అయితే చికిత్స తీసుకున్న తరువాత కొత్త అందం రావడం కాదు సహజ రంగును కూడా కోల్పోయింది ఆ నటి. దీంతో ఆమె వినియోగదారుల ఫోరం కి ఫిర్యాదు చేయగా 50 వేల రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: