ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హై స్పీడ్ తో దూసుకుపోతున్నారు అన్నది అర్ధమవుతుంది.  వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి.  కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే షూటింగ్స్ ప్రారంభం అయ్యాయో ఇక అప్పటినుండి సినిమాలను చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు ఇక ఇటీవల ఏకంగా ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో మలయాళం మూవీ అయినా లూసిఫర్ రీమేక్ ఒకటి అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా ఇక తమిళ చిత్రం వేదాళం రీమేక్ కూడా చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి.



 అయితే లూసిఫర్ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతు ఉండగా వేదాళం రీమేక్ మెహర్ రమేష్ తెరకెక్కించబోతునట్లు తెలుస్తోంది. అదే సమయంలో యంగ్ డైరెక్టర్ బాబితో మరో సినిమా చేసేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారట. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది  .  అయితే వేదాళం రీమేక్ సినిమా కంటే ముందే యువ దర్శకుడితో సినిమాను తెరకెక్కించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా పట్టా లెక్కించేందుకు అన్ని పనులు పూర్తి చేస్తుందట చిత్రబృందం.


 ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో హీరోయిన్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ శృతిహాసన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోండగా.. ఇప్పుడు మరో పేరు కూడా ఈ లిస్టులో వచ్చి చేరింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సోనాక్షి సిన్హా.  మెగాస్టార్ సినిమా లో నటింపజేసేందుకు సోనాక్షి సిన్హ తో దర్శకుడు బాబి చర్చలు జరుపుతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. మరి మెగా స్టార్ సినిమాకు ఈ బాలీవుడ్ బ్యూటీ ఒప్పుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: