ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తండ్రి కమల్ హాసన్ లాగానే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో కాటమరాయుడు తర్వాత రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ రీఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన శృతిహాసన్ తాజాగా సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది.తనకు టీ అంటే ఎంతో ఇష్టమని కాఫీ అస్సలు తాగనని శృతి చెప్పింది.



ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయనతో కలిసి మూడోసారి పని చేయడం తన అదృష్టమని శృతి పేర్కొన్నది.ప్రేమమ్ సినిమాలో చైతన్యతో కలిసి నటించిన శృతి చైతూ చాలా మంచి వ్యక్తి అని చైతన్యతో కలిసి పని చేయడం మధురమైన అనుభవం అని వెల్లడించింది. ప్రశాంత్ నీల్ తో కలిసి పని చేయడం గురించి స్పందిస్తూ ప్రశాంత్ నీల్ చాలా ప్రశాంతంగా ఉంటారని స్పష్టత ఉన్న వ్యక్తి అని శృతి హాసన్ పేర్కొన్నది. హీరో నాని గురించి కొన్ని మాటలు చెప్పాలనే నెటిజన్ ప్రశ్నకు నాని అద్బుతమైన వ్యక్తి అని నానితో కలిసి పని చేసే అవకాశం తనకు ఇప్పటివరకు రాలేదని శృతి తెలిపింది.ప్రస్తుతం వీళ్లపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


ఇంకా మాట్లాడుతూ తాను నటి కాకపోయి ఉంటే క్రియేటివ్ గా ఏదో ఒకటి చేసేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ చెప్పింది.తనకు టైమ్ మెషీన్ దొరికితే 8వ తరగతిలో వెళ్లి కూర్చుంటానని తనకు నలుపు రంగు అంటే ఇష్టమని ఈ హాట్ బ్యూటీ చెప్పింది.ఇష్టమైన భోజనం గురించి స్పందిస్తూ సాంబార్ అన్నం, దోశ తాను ఎంతో ఇష్టంగా తింటానని ఆమె చెప్పింది. నిజం, నిద్ర, కౌగిలింత తనను సంతోషంగా ఉంచే మూడు విషయాలని శృతి తెలిపింది. స్క్రిప్ట్ నచ్చితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడానికి అభ్యంతరం లేదని ఈ హాట్ బ్యూటీ తెలిపింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకొండి...

మరింత సమాచారం తెలుసుకోండి: