కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్ తన ప్రతిభతో అనతి కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ హీరో ఓకే బంగారం, కనులుకనులను దోచాయంటే వంటి పలు డబ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న ఈ మహానటి సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. మహానటి సినిమా దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమాలో జెమినీ గణేశన్‌ పాత్రలో ఒదిగిపోయి నటించిన దుల్కర్‌ కు తెలుగు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదే జోష్ లో దుల్కర్ వైజయంతి  బ్యానర్ పై మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన  విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అందాల రాక్షసి ఫేం డైరెక్టర్  హను రాఘవపూడి  దర్శకత్వం వహించబోతున్నారు అని, అందుకు సంభందించిన చర్చలు కూడా జరిగి పోయాయని వార్తలు కూడా గట్టి గానే వినిపించాయి. అయితే   రోజులు గడుస్తున్నా దాని గురించి ఎటువంటి అప్డేట్ రాకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ తో దుల్కర్ మూవీ క్యాన్సిల్ అయిందన్న కథనాలు వినిపిస్తున్నాయి. అందులోనూ వైజయంతి వారు ప్రభాస్ తో సినిమా  తెరకెక్కిస్తూ బిజీ అయిపోవడంతో దుల్కర్ సినిమా కి బ్రేక్ పడినట్లే అంటున్నారు.

మరి నిజంగానే వైజయంతి మూవీస్ బ్యానర్ పై దుల్కర్ మూవీ ఉన్నట్టా లేనట్టా అన్న అసలు విషయం తెలియాలంటే ఇటు  హీరో దుల్కర్ లేదా మహానటి నిర్మాత ఎవరో ఒకరు పెదవి విప్పితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. కాగా ప్రస్తుతం  దుల్కర్ కురుప్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ మధ్యనే విడుదలయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: