అల్లు
అర్జున్ హీరోగా
సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
రష్మిక మందాన్న
హీరోయిన్ గా నటిస్తుంది.
డిసెంబర్ 17వ తేదీన ఈ చిత్రం మొదటి భాగం విడుదల కాబోతు ఉండగా రెండో భాగంను వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక దర్శకుడు
సుకుమార్ మొదటి నుంచి తన సినిమాలను చాలా ఆలస్యంగా తెరకెక్కిస్తాడు అనే పేరు ఉంది. దానికి తగ్గట్లుగానే ఆయన గత సినిమాలు చాలా వరకు
ఆలస్యంగా చిత్రీకరణ అవుతూ వచ్చాయి.
టాలెంట్ పరంగా కలెక్షన్ల పరంగా దర్శకుడు
సుకుమార్ సినిమాలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. కానీ ఈ ఒక లోపం ఆయనను ఇతర దర్శకులతో పోలిస్తే వెనక పడేలా చేస్తుంది. ఇక పుష్ప విషయంలో కూడా ఆయన కొంత ఆలస్యం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ కూడా మధ్యలో
సుకుమార్ ఈ
సినిమా తొందరగా ఫినిష్ చేయాలని వార్నింగ్ వారిని కూడా ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇక ఈ
సినిమా విడుదల కావడానికి కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇంకా మొదటి భాగం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను
సుకుమార్ చేయకపోవడం ఒక్కసారిగా అందరినీ ఎంతగానో టెన్షన్ పెట్టిస్తుంది. దర్శకుడు
సుకుమార్ శిల్పం చెక్కినట్లు ఈ
సినిమా ను ఎడిట్ చేస్తూ ఉండడంతో అభిమానులు అనుకున్న సమయానికి ఈ చిత్రం విడుదల అవుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఆయనకు ఇటీవలే అస్వస్థతగా ఉండడంతో కొన్ని రోజులు ఈ
సినిమా కార్యక్రమాలకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ
సినిమా అనుకున్న తేదీకే విడుదల అవుతుందా అనే అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. మరి
అల్లు అర్జున్ హీరోగా తొలి సారి పాన్
ఇండియా సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి విడుదలను జరుపుకుంటుందో చూడాలి.