ఇకపోతే దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న అల్లు అర్జున్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా ఆత్రుత గానే ఉన్నారు. ఈ క్రమంలోనే థియేటర్లకు బారులు తీరుతున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వ నిబంధనల కారణంగా ఎలాంటి బెనిఫిట్ షోలు వెయ్య లేదు అన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం కొన్ని థియేటర్లలో బెనిఫిట్ షో లు వేసారు. అయితే ఆంధ్రా లో బెనిఫిట్ షోలు వేయకపోవడంతో అప్పటికే చిరాకు లో ఉన్న ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయంలో ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇక పుష్ప సినిమా నేపథ్యంలో భారీగా అభిమానులు తరలి వస్తే ఏదైనా ఆస్తి నష్టం కలుగుతుందని థియేటర్ యాజమాన్యం కాస్త భయం భయంగానే ఉంది. ఇప్పుడు అనుకున్నదే జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని పళని సినిమా థియేటర్ పుష్ప చూడడానికి వెళ్లిన అభిమానులు సౌండ్ సరిగా వెయ్యలేదని రచ్చ చేశారు. శ్రీవళ్లి పాట వచ్చిన సమయంలో సౌండ్ సరిగ్గా లేదు అంటూ అద్దాలు కుర్చీలను ధ్వంసం చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యానికి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి