రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ సోయగం..ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ మంచి మార్కులు వేయించుకుంటూ స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్స్ అందుకుంది. మహేష్ బాబు పక్కన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ పక్కన పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రతో అదరగొట్టేసింది. ఫుల్ డీ గ్లామరస్ లుక్ లో కనిపించి చించేసింది.

ఇక ప్రస్తుతం అమ్మడు ఇటు తెలుగుతో పాటు అటు బాలీవుడ్ లోను వరుస సినిమాలతో బిజీ గా ఉంది. అయితే, సినిమా ల పరంగా ఎప్పుడు హాట్ టాపిక్ అవ్వని రష్మిక .. తన పరసనల్ లైఫ్ విషయలల్లో మాత్రం నెట్టింట ట్రోల్  అవుతూనే ఉంటుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక బాండింగ్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు ట్రెండింగ్  లోనే ఉంటాయి. గీతాగోవిందం సినిమాలో జంటగా నటించిన ఈ జంట అంటే అభిమానుల్లో పిచ్చ క్రేజ్ ఉంది.
 
ఇక దానికి తగ్గట్లే ఈ జంట కూడా కలిసి బయటకు వెళ్ళడం..వెళ్లిన ప్రతిసారి మీడియా కంట పడడం..దొరికిన ప్రతిసారి మేం జస్ట్ ఫ్రెండ్స్ అనడం కామన్ అయిపోయింది. ఇక రీసెంట్ గా రష్మిక , విజయ్‌ మరోసారి మీడియా కంట పడ్డారు. ముంబైలో ని బాంద్రాలోని రెస్టారెంట్‌లో  రాత్రి డిన్నర్‌ డేట్‌ కు వెళ్లారు రష్మిక,విజయ్. ఇక అక్కడే ఉన్న మీడియా కంట పడ్డింది ఈ క్యూట్ కపుల్. ఇక్కడ  డౌట్లు వచ్చే విషయం ఏమిటంటే..రెస్టారెంట్‌ లో నుండి ముందు విజయ్ వచ్చి కార్ ఎక్కారు..ఆ తరువాత రష్మిక కొంచెం సేపటికి  వచ్చి విజయ్ కార్ లోనే ఎక్కింది. దీంతో వీళ్ల మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దుమ్మురేపుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: