మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్  ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య మూవీ లో  హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో  చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు.

మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజీ దర్శకులలో ఒకరు అయిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు.  మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న ఆచార్య సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను  పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగింది.  అందులో భాగంగా ఆచార్య సినిమా కు కర్ణాటక ఏరియాలో 9 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.  

అలా కర్ణాటక ఏరియా లో అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఆచార్య సినిమా కర్ణాటక ఏరియాలో దాదాపు పది కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.  కాకపోతే ఆచార్య సినిమాకు విడుదలైన మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో ఇప్పటివరకు ఆచార్య సినిమా కర్ణాటక ఏరియాలో 2.40 కోట్ల మేర షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. దానితో కర్ణాటక ఏరియాలో ఆచార్య సినిమా దాదాపుగా 6.40 కోట్ల మేర నష్టాలను మిగిల్చిన తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: