క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్ పేరు తెలియని తెలుగువాడు ఉండడు. ఒకప్పుడు ప్రపంచ స్థాయి అగ్ర నేతలతో కలిసిమెలిసి అనేక వేదికలు పంచుకున్న ఇతడి ఇంటర్వ్యూ లభించాలి అంటే అప్పట్లో ఎవరికైనా జరగని పని. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోయినా తిరిగి మళ్ళీ ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ‘ప్రజాశాంతి’ పార్టీని పెట్టి తెలుగు రాష్ట్రాలలో ఆపార్టీని నిలబెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.


ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై స్పందించాడు. తాను సాధారణంగా సినిమాలు చూడను అని అంటూ అంతసమయం కూడ తనకు ఉండదని కామెంట్ చేసాడు. అయితే తన పిల్లలు మాత్రం సినిమాలు బాగా చూస్తారని అంటూ ఆమధ్య తన ఇంటిలో తన పిల్లలు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని చూస్తున్నప్పుడు తనను కూడ చూడమని బలవంత పెడితే ఆమూవీని చూడటానికి ప్రయత్నించి ఒక్క నిముషం మించి చూడలేకపోయాను అని కామెంట్స్ చేసాడు.


ఇప్పటివరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ పై ఇలాంటి స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ చేసిన వ్యక్తి ఎవరు లేరనే అనుకోవాలి. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించి 12వందల కోట్లు పైగా కలెక్ట్ చేసిన ఈమూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెటర్. వాస్తవానికి ఈమూవీ పై కొందరు విమర్శలు చేసినప్పటికీ ఈ స్థాయిలో నెగిటివ్ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరు లేరని అనుకోవాలి.


గతంలో ‘బాహుబలి’ సినిమా పై ఒకనాటి టాప్ హీరోయిన్ జమున స్పందిస్తూ ఆసినిమాలో ఏముంది అంటూ కామెంట్ చేయడమే కాకుండా ఆసినిమా చూస్తున్నప్పుడు తనకు నిద్ర వచ్చింది అని కూడ కామెంట్స్ చేసింది. దీనికి అటూఇటూ గా నటుడు సత్యనారాయణ కూడ ‘బాహుబలి’ మూవీ పై గతంలో స్పందిస్తూ ఆమూవీ ఒక చందమామ కథ లా ఉందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కెఎ పాల్ కూడ ఈ లిస్టులో చేరిడంతో రాజమౌళి సినిమాలను విమర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోందనే అనుకోవాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: