రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' లాంటి భారీ విజయం తర్వాత సాహో , రాధే శ్యామ్ అనే భారీ పాన్ ఇండియా మూవీ లలో నటించినప్పటికీ ఈ రెండు సినిమాలు కూడా  ప్రభాస్ కు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చాయి . ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ ,  సలార్ , ప్రాజెక్ట్ కే అనే మూవీ లలో నటిస్తున్నాడు .

ఇందులో ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది . ఆది పురుష్ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్, నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సలార్ సినిమా అదిరిపోయే యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది . ఈ సినిమాలో శృతి హాసన్, ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తుండగా , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు . అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా , బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ , మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా సలార్ ,  ప్రాజెక్ట్ కే సినిమాల షూటింగ్ ముగిసిన తర్వాతనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: