దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ మల్టీస్టారర్ గా నటించారు. ఈ ఏడాది మార్చి 25న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన అనంతరం హాలీవుడ్ ప్రేక్షకులు, డైరెక్టర్లు సైతం ప్రశంసలు కురిపించారు రాజమౌళి పైన. ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ హీరోయిన్ నికిషా పటేల్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది వాటి గురించి చూద్దాం.


ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి ఆధార పొందిన ఈ సినిమా ఈమెకు మాత్రం నచ్చలేదని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. నీకిషా పటేల్ టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించినా ఏవి అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి కొమరం పులి చిత్రంలో నటించిన ఈమె ఆ సినిమా కూడా భారి డిజాస్టర్ ని చవిచూచింది. తమిళంలో తన అదృష్టాన్ని పరిరక్షించుకోవడానికి అక్కడ కూడా సినిమాలలో నటించగా అక్కడ కూడా ఆకట్టుకోలేకపోయింది.


దీంతో తన స్వదేశమైన బ్రిటిష్ కు తిరిగి వెళ్ళిపోయి అక్కడే ఉన్నది. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా rrr సినిమా చూసిన ఈమె తనకు ఈ చిత్రం అసలు నచ్చలేదని ధైర్యంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ ట్విట్ పై నందమూరి అభిమానులు స్పందిస్తూ సినిమా నచ్చడం నచ్చకపోవడం వారి సొంత నిర్ణయం అయితే నచ్చలేదని విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఆమె పైన ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన అ ట్వీట్ కాస్త వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: