RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్ర RC -15 ఈ సినిమా ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే శంకర్ కి ఉన్న కోర్టు చిక్కుల కారణాల వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతోందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అలాగే భారతీయుడు -2 సినిమా కోసం మరికొన్ని రోజులు షూటింగ్ అని పోస్ట్ ఫోన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమా షూటింగ్ సగభాగం పూర్తి అయ్యిందని ఇటీవలే తిరుపతిలో భారతీయుడు-2 సినిమా షెడ్యూల్ ని కూడా ముగించారని మరో 10 రోజుల్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ని మొదలు పెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమా ప్రాజెక్టుల పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా సమాచారం. దిల్ రాజుతో కలిసి పనులు కూడా చాలా చకచగా పూర్తి చేసేందుకు సహకరిస్తున్నట్లుగా తెలుస్తున్నది.


ఇక సంగీతం కోసం థమన్ ని కూడా కలవడం జరిగిందట దీంతో ఇలా పనులన్నీ పూర్తి చేయడంతో అభిమానులకు RC -15 సినిమా పైన కాస్త భరోసా పెరుగుతోందని చెప్పవచ్చు సమాచారం. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ రాత్రి సమయాలలో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాతో కచ్చితంగా మరొక విజయాన్ని అందుకోవాలని చాలా కసితో ఉన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: