టాలీవుడ్ స్టార్
హీరో విజయ్
దేవరకొండ ఏకంగా 12 మంది దర్శకులతో సినిమాలు చేయబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విజయ్
దేవరకొండ ఆ సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయాడు. దాంతో తన తదుపరి
సినిమా ఎంతో జాగ్రత్తగా చేయాలి తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధమైన
సినిమా చేయాలి అని భావించి ఆయన తదుపరి
సినిమా చేస్తున్నాడు.
ఆ విధంగా
శివ నిర్వాణ దర్శకత్వంలో
ఖుషి అనే
సినిమా చేస్తున్న విజయ్
దేవరకొండ ఆ చిత్రం తర్వాత ఎవరితో
సినిమా చేయాలి అన్న ఆసక్తితో ముందుకు వెళుతున్నాడు. ఇప్పటికే ఆయనకు చాలామంది దర్శకులు కథలను వినిపించారన్న వార్తలు బయటకు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ దర్శకుడు
హరీష్ శంకర్ గౌతమ్ తిన్ననురి
శేఖర్ కమ్ముల వంటి దర్శకులు ఇప్పటికే ఆయనకు కథలు చెప్పి సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమవగా ఆ తరువాత కొంతమంది
బాలీవుడ్ దర్శకులు కూడా ఈ హీరోతో
సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తూన్నారు అనే వార్తలు రావడం విశేషం.
ఇది విజయ్
దేవరకొండ అభిమానులను ఎంతో గర్వపడేలా చేస్తుంది. ఇంత మంది దర్శకులు తమ హీరోతో
సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం మంచి విషయం అని చెబుతున్నారు. అయితే వారందరూ చిన్న దర్శకులు కాకుండా ఈ జాబితాలో అగ్ర దర్శకులు కూడా ఉండడం మరింత విశేషం. ఏదేమైనా విజయ్
దేవరకొండ ఫ్లాప్ సినిమాలను వరుసగా రెండు చేసిన కూడా ఈ స్థాయిలో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకులు క్యూ కట్టడం విశేషం. మరి ఆయన తదుపరి
సినిమా వీరిలో ఎవరితో చేస్తాడు అన్న విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన నర్తన్ అనే దర్శకుడు తో కలిసి కథ ను వినడం జరిగింది. మరి విజయ్
దేవరకొండ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి.