సెప్టెంబర్ నెల చివరిలో ఎలాంటి అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా విడుదలైన కాంతారా సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే   అనేక భాషల్లో విడుదల కూడా అయ్యింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు 400 కోట్లకు పైగా వసూళ్లను కూడా రాబట్టింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో మాత్రమే ఈ సినిమా రావడం  జరిగింది. అయితే తాజాగా ప్రముఖ యాంకర్ మరియు నటి అయిన అనసూయ  కాంతారా సినిమా దర్శకుడు... హీరో అయిన సీనియర్ నటుడు  రిషబ్ గురించి సంబంధించి కొన్ని కామెంట్ చేయడం జరిగింది.  

ప్రస్తుతం  కృష్ణవంశీ సినిమాలో  నటిస్తున్నారు ఈమె... అయితే సినిమాలో క్లైమాక్స్ లో ఆయన తన నటనతోనే సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లడని... దాంతో భాషతో సంబంధం లేకుండా సినిమాను అందరూ ఎంజాయ్ చేశారని.. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఆయన్ని పిలిపించుకొని మరి అభినందించారని కూడా గిఫ్ట్ గా ఇచ్చారని ఒక కర్ణాటక రాష్ట్రంలోని కాంతార సినిమా థియేటర్లలో కోటి మందికి పైగా చూడడం జరిగిందని ఇప్పుడు కాంతారావు సినిమాకి లభించిన పబ్లిసిటీ మరి ఏ సినిమాకి రాలేదని కాంతారా సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ రిషబ్ శెట్టి ఈ సినిమాలో నమ్మసక్యం కాని రీతిలో యాక్ట్ చేశారని.. అంతే కాదు ఆ సినిమా ప్రభావం నుంచి నేను అంత త్వరగా బయటికి రాలేకపోయానని చెప్పుకొచ్చింది. అయితే వాస్తవానికి చాలామంది ఇలాగే అభిప్రాయపడ్డారు. 

అంతేకాకుండా ఆ సినిమాలో వచ్చే ఒక శబ్దం థియేటర్ నుంచి వెలుపలికి వచ్చిన తరువాత కూడా కొన్ని నిమిషాల పాటు మనకు వినిపిస్తూనే ఉంటుందని ...అంతలా ఈ సినిమా ప్రభావితం చేసిందని అనసూయతోపాటు చాలామంది సెలబ్రిటీలు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.ఇక ప్రస్తుతం అనసూయ సినిమాలలో బిజీగా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగ మార్తాండ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల సినిమాలు కారణంగా జబర్దస్త్ కి కూడా దూరమైంది అనసూయ .జబర్దస్త్ కి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఈమె తనకి సంబంధించిన ఫోటోలను ఎప్పుడూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: