కింగ్ ఖాన్ గా బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన షారుఖ్‌కు గత కొన్నేళ్లుగా హిట్టే లేదు. వరుస ఫ్లాపులతో  షారుఖ్‌ మార్కెట్‌ పూర్తిగా డౌన్‌ అయిపోయింది. దాంతో దెబ్బకు రెండేళ్ళు ఒక్క సినిమాను కూడా చేయలేదు. ఆ రెండేళ్ల గ్యాప్‌లో చాలా కథలు విన్నాడు. కానీ ఒక్కటికి కూడా ఆయనకి సెట్‌ కాలేదు. చివరికి సిద్ధార్థ్‌ ఆనంద్‌  ‘పఠాన్‌’ కథను ఒకే చేశాడు. దాదాపు మూడేళ్లుగా ఇదే సినిమాపై పని చేశాడు. టైటిల్‌ పోస్టర్‌ దగ్గర నుండి ట్రైలర్‌ దాకా ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి.ముఖ్యంగా భేషరమ్‌ రంగ్‌ సాంగ్‌తో ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ పాటపై పలు విమర్శలు వచ్చినా జనాలకు మాత్రం పఠాన్‌ సినిమా సంథింగ్ అన్నట్లు అనిపించింది.షారుఖ్‌ చాలా కాలం తరువాత నటించిన ఈ సినిమా రానుండటంతో అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలవడం ఆలస్యం.. సినిమా టిక్కెట్‌లు హాట్‌ కేకుల్లా చాలా స్పీడ్ గా అమ్ముడైపోయాయి.


పీవీఆర్‌, సినీ పోలిస్‌ ఇంకా అలాగే ఐనాక్స్‌ వంటి మల్టీప్లెక్స్‌లలో కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 2 లక్షలు టిక్కెట్‌లు అమ్ముడవడం విశేషం. ఇప్పటి దాకా హిందీలో ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఇన్ని టిక్కెట్‌లు అమ్ముడుకాలేదు. రిలీజ్‌కు ముందే ఇలా సరికొత్త రికార్డులను పఠాన్‌ సినిమా నెలకొల్పింది.ఇంకా అంతేకాకుండా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమాకు ఏకంగా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.ఈ లెక్కన చూసుకుంటే మొదటి రోజు రూ.50 కోట్ల నుండి రూ 60 కోట్ల రేంజ్‌లో ఈ సినిమాకి ఓపెనింగ్స్ రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఇక ఇదే జరిగితే బాలీవుడ్ లో ఆ మార్కు టచ్‌ చేసిన మొదటి  హీరోగా షారుఖ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. వరుస డిజాస్టర్‌లు చూసిన షారుఖ్‌ ఖాన్ ఇలాంటి రికార్డుతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం నిజంగా విశేషం అనే చెప్పాలి. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: