వీరికి రాజా గౌతమ్, సిద్ధార్ద్ అనే ఇద్దరు కుమారులున్నారు.తండ్రి నాటకాల్లో వేయడం వలన ఇతడికి కూడా నాటకాలంటే ఇష్టం ఉండేది. ఫ్రెండ్స్ ముందు కామెడీ చేసేవాడు. దూరదర్శన్ లో పకపకా అనే ప్రోగ్రాం లో చేసాడు. జంధ్యాల డైరెక్ట్ చేసిన అహ నా పెళ్ళంట మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఆ సినిమాలో అరగుండు బ్రహ్మానందం క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. 1987లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు 6వేల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు.
మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మానందం క్యారెక్టర్ నచ్చడంతో పసివాడి ప్రాణం మూవీలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు.1994లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు, 2003లో బెస్ట్ మేల్ కమెడియన్ గా,2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం కోటి నుంచి కోటి 50లక్షల వరకూ అందుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇష్టమైన హీరోలు. మహానటి సావిత్రి ఇష్టమైన హీరోయిన్. వైజాగ్ అంటే ఇష్టం. డ్రాయింగ్ అండ్ యాక్టింగ్ ఇష్టం. ఇతడికి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండలో పంచాయితీ ట్రావెల్స్ లో దాదాపు 7కోట్ల విలువైన ది ట్రయల్స్ విల్లా లో ఉంటున్నాడు. దాదాపు తన ఆస్తి విలువ 500 నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇద్దరు కొడుకులు కూడా బాగా సంపాదిస్తూ మంచి స్థాయిలో ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి