టాలీవుడ్ స్టార్ నటుడు  రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం దొంగ హీరోనా? అంటూ... పరోక్షంగా పుష్ప 2 సినిమాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్.  హీరో అల్లు అర్జున్ టార్గెట్ చేసి... ఈ మధ్యకాలంలో చాలామంది రెచ్చిపోతున్నారు. మెగా కుటుంబానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ప్రచారం చేశాడని...ఎల్లో మీడియాతో పాటు తెలుగు తమ్ముళ్లు కూడా... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు.


పుష్ప 2 సినిమా రిలీజ్ కంటే ముందు నుంచే... ఈ రచ్చ మొదలైంది. అయినప్పటికీ అల్లు అర్జున్ నిలబడ్డాడు. సక్సెస్ అందుకుని చూపించాడు.  అయితే ఇలాంటి నేపథ్యంలో.. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. చందనం దుంగలను దొంగతనం చేసే దొంగ...ఇప్పుడు హీరో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హీరో అల్లు అర్జున్ ను ఉద్దేశించి అని... సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  

 

హరికథ అనే మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో  రాజేంద్రప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వైసిపి పార్టీ ఎక్కువగా ట్రోలింగ్ చేస్తోంది. అన్యాయంగా అల్లు అర్జున్ టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే  టాలీవుడ్ నటులంతా...టార్గెట్ చేస్తున్నారని మండిపడుతోంది వైసిపి. మొన్నటికి మొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా...ఎర్రచందనం దొంగలు హీరోలు అయ్యారని.. వ్యాఖ్యానించిన కామెంట్స్ ను వైసీపీ సోషల్ మీడియా గుర్తు చేస్తోంది.


ఇక ఇప్పుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను... ఎండగడుతోంది వైసీపీ సోషల్ మీడియా.ఇలాఅల్లు అర్జున్ కు కవచంలా నిలుస్తోంది వైసీపీ పార్టీ. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 దాదాపు 800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. మరో రెండు రోజుల్లో 1000 కోట్లు దాటి 1500 కోట్లకు కూడా పరుగులు పెట్టనుంది. దీంతో పుష్ప చిత్ర బృందం హ్యాపీగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: