"మనం" సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది.  అంత ఈజీగా అక్కినేని అభిమానులు ఈ సినిమాని మర్చిపోలేరు.  అక్కనేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగార్జున.. నాగచైతన్య.. అఖిల్ ..అమల అందరు కలిసి ఈ సినిమాలో నటించారు . ఆశ్చర్యమేంటంటే అప్పటికే కోడలు కాకపోయినా సరే హీరోయిన్ సమంత కూడా ఈ సినిమాలో నటించి అక్కినేని ఫ్యామిలీ మెంబర్గా ముందుగానే ఆ ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చేసింది . అఫ్కోర్స్ ఆ తర్వాత దేవుడు వాళ్ళ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయాడు . హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతకి విడాకులు ఇచ్చేసి శోభిత ధూళిపాళ్లని పెళ్లి చేసుకున్నాడు.


అయితే మనం సినిమా తర్వాత నాగార్జున - నాగచైతన్య - అఖిల్ కలిసి ఒక సినిమాలో నటించాల్సి ఉండింది . కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా నుండి అఖిల్ తప్పుకున్నాడు . కేవలం నాగచైతన్య నాగార్జున మాత్రమే నటించారు . ఇప్పటికే ఆ సినిమా ఏంటో మీకు అర్థమైపోయింది అనుకుంటాను . ఎస్ "బంగార్రాజు".  ఈ సినిమాలో నాగచైతన్య - నాగార్జున కలిసి నటించారు . నిజానికి అఖిల్ కూడా ఈ సినిమా నటించాలంట . కానీ క్యారెక్టర్ పరంగా అఖిల్ పాత్ర యాడ్ చేసినట్లు ఉంటుంది అని ఈ సినిమాకి ఇద్దరు హీరోలు ఉంటేనే బాగుంటుంది అని డైరెక్టర్ సజెస్ట్ చేయడంతో అఖిల్ పాత్రను ఈ సినిమా నుంచి తీసేసారట .



అసలు దైరెక్టర్ ఇద్దరి హీరోలతోనే ఈ సినిమాని రాసుకున్నాడట. కానీ నాగార్జున నే ఈ సినిమాలో అఖిల్ ని కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ..డైరెక్టర్ కి ఎక్స్ట్రా క్యారెక్టర్ రాయించారట. కానీ డైరెక్టర్ ఆ క్యారెక్టర్ రాసుకున్న..సినిమాలో యాడ్ చేయడానికి ఇష్టపడలేదు. ఒకవేళ అన్ని సెట్ అయి ఉంటే మాత్రం మనం సినిమా తర్వాత నాగచైతన్య - నాగార్జున- అఖిల్ ఈ సినిమాలో నటించి మెప్పించి ఉండేవారు. జస్ట్ మిస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: