గత కొన్నేళ్లలో టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగింది. అందుకు తగ్గట్టే మన హీరోలు కూడా రెమ్యునరేషన్ విష‌యంలో ఒక‌ర్ని మించి ఒక‌రు ఛార్జ్ చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు మరియు లాభదాయకమైన ఒప్పందాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. త‌మ మార్కెట్‌, క్రేజ్ దృష్ట్యా కొంతమంది నటులు తమ పారితోషికంలో గణనీయమైన పెరుగుదలను కూడా చూశారు. ఈ నేప‌థ్యంలోనే 2025లో టాలీవుడ్ హీరోల రెమ్యున‌రేష‌న్ లెక్క‌లు ఎలా ఉన్నాయి అన్న‌ది తెలుసుకుందాం.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప‌` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మార‌డ‌మే కాకుండా త‌న మార్కెట్ ను అమాంతం పెంచుకున్నాడు. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో త‌న త‌దుపరి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. `AA22` వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్ర‌క‌టించ‌బ‌డ్డ ఈ చిత్రానికి అల్లు అర్జున్ ఏకంగా రూ. 175 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడ‌ని టాక్‌.


`స‌లార్`, `క‌ల్కి 2898 ఏడీ` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం అర డ‌జ‌న్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈయ‌న ఒక్కో మూవీకి రూ. 200 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్నాడ‌ని అంటున్నారు.
`ఆర్ఆర్ఆర్‌`తో ఇంట‌ర్నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు చొప్పున ఛార్చ్ చేస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పారితోషికం రూ. 80 కోట్ల రేంజ్ లో ఉందని.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న రాబోయే `SSMB29` మూవీకి రూ. 100 కోట్లు పుచ్చుకుంటున్నాడని ప్ర‌చారం జ‌రుగుతోంది.


సీనియ‌ర్ స్టార్స్ లో చిరంజీవి రూ. 50 కోట్లు, వెంక‌టేష్ మ‌రియు బాల‌య్య రూ. 30 కోట్లు, నాగార్జున రూ. 20 కోట్లు తీసుకుంటున్నార‌ట‌. అలాగే హీరోగా, నిర్మాత‌గా దూసుకుపోతున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. ఒక్కో చిత్రానికి రూ. 35 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌. టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఉస్తాద్ రామ్ పోతినేని, ర‌వితేజ‌ రెమ్యున‌రేష‌న్స్ కూడా రూ. 20 కోట్ల రేంజ్‌లోనే ఉన్నాయ‌ని టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: