లవ్ టుడే చిత్రంతో డైరెక్టర్ నుంచి హీరోగా మారి తన తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు హీరో ప్రదీప్ రంగనాథ్.. ఇక తన రెండవ చిత్రం డ్రాగన్ తో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరి సక్సెస్ఫుల్ హీరోగా పేరు సంపాదించారు. దీంతో ప్రదీప్ రంగనాథ్  అన్ని భాషలలో నుంచి నటించడానికి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్యూడ్ అనే చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రదీప్. డ్యూడ్ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడడంతో ఈ చిత్రాన్ని బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.


కోలీవుడ్లో స్టార్ దర్శకులుగా పేరుపొందిన సుధా కొంగర వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి కీర్తిశ్వరన్ డైరెక్షన్లో డ్యూడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్ రూ.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా 20 నుంచి 25 కోట్ల రూపాయలలోపే ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే డ్యూడ్ సినిమాకి కేవలం డిజిటల్ రైట్స్ తోనే లాభాల జోన్లోకి వెళ్లిపోయింది.


ఇంకా మ్యూజిక్ మరియు శాటిలైట్ రైట్స్ కూడా చేతిలో ఉన్నాయి. థియేటర్లో ఒకవేళ హిట్ టాకు వస్తే అక్కడ నుంచి కూడా భారీగానే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎలా అయినా చూసిన కూడా మైత్రి మూవీస్ మేకర్స్ కి ప్రదీప్ రంగనాథ నటిస్తున్న డ్యూడ్ సినిమాతో జాక్ పాట్ కొట్టినట్టుగా అభిమానులు భావిస్తున్నారు. ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ప్రాపర్టీ దశలో సినిమా అంటే నిర్మాతలకు ఇంతకుమించి ఆనందం ఏదైనా ఉంటుందా అంటూ పలువురు అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రేమలో హీరోయిన్ మమితా బైజు నటిస్తున్నది. దీపావళికి విడుదల చేసేలా ఈ ఏడాది ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: