
అంతేకాదు రీసెంట్ గానే " కుబేర " సినిమాతో నాగార్జున కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు . ఇలా బ్యాక్ టు బ్యాక్ అక్కినేని ఫ్యామిలీకి అన్ని గుడ్ న్యూస్ లే వినిపిస్తూ వస్తున్నాయి . ఇదే మూమెంట్లో "తండేల్" సినిమా తర్వాత నాగచైతన్య కార్తీక్ వర్మ దండుతో ఒక మూవీకి కమిట్ అయ్యాడు. "వృషి కరం" అంటూ ఈ సినిమాకి టైటిల్ పెట్టినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత తమిళ్ డైరెక్టర్ పి.ఎస్ మిత్రన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది .
నాగచైతన్య ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేశాడు అంటూ సినీ వర్గాలు తెలుపుతున్నాయి . ప్రెసెంట్ మిత్రం కార్తీ తో "సర్ధార్ 2" చేస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే నాగచైతన్య సినిమా సెట్స్ పైకి తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారట . మరొక పక్క తండ్రి నాగార్జున సైతం తమిళ్ డైరెక్టర్ కార్తీక్ తోనే సినిమా చేయడానికి ప్లాన్ చూసుకుంటున్నాడు . త్వరలోనే ఈ సినిమాలు మొదలు కాబోతున్నాయి. తండ్రి బాటలోనే నాగచైతన్య సైతం తమిళ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడం హైలెట్ అవుతుంది. తెలుగులో బోలెడు డైరెక్టర్స్ ఉన్నారు.. అవకాశాలు కూడా వస్తున్నాయి . కానీ నాగచైతన్య - నాగార్జున తమిళ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతూ ఉండటం తమిళ డైరెక్టర్లకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అక్కినేని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి న్యాచురల్ కధలతో ముందుకు రాబోతున్నారు అక్కినేని హీరోస్ అంటూ తెగ పొగిడేస్తున్నారు అక్కినేని అభిమానులు..!!