ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో పెద్ద హీరోలతో పోలిస్తే చిన్న హీరోల సినిమాలే సంచలనాలు సృష్టిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జ గతేడాది హనుమాన్ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు కూడా సోషల్ మీడియా వేదికగా మారు మ్రోగింది.

తేజ సజ్జ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో మిరాయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ఐదవ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 55 కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయని సమాచారం. ప్రముఖ ఓటిటిలలో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ హక్కులను కొనుగోలు చేసిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ వన్ హీరోలు మినహా మరే హీరో సినిమాలు ఈ స్థాయిలో పలకవు. వరుస విజయాలతో తేజ సజ్జ మార్కెట్ ను పెంచుకోవడంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగిందని కచ్చితంగా చెప్పవచ్చు. మిరాయ్ సినిమా థియేటర్ హక్కులకు సైతం మంచి డిమాండ్ నెలకొంది.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2025 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా సిజి పనులు అనుకున్న సమయానికి పూర్తయితే మాత్రమే సెప్టెంబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తేదీకి ఘాటి సినిమాతోపాటు రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఇతర సినిమాలతో పోటీపడి విడుదల కావాల్సిన పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: