
సందీప్ రెడ్డి వంగాతో కలిసి చేసిన చిట్ చాట్ లో కూడా విజయ్ మామూలుగా ఉండేలా లేడన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది. మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపించినా, అతి ఆత్మవిశ్వాసం లేదు. ఎందుకంటే ఇప్పుడు విజయ్కు తెలిసిపోయింది – మాటలు కాదు, సినిమా ఫలితం మాట్లాడాలని. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ మార్పుకు నిర్మాత నాగవంశీ కీలకంగా ఉన్నారు. ‘కింగ్డమ్’ రిలీజ్ ముందు నుంచే విజయ్ను పూర్తిగా కంట్రోల్ చేస్తూ వచ్చారట. “ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకు.. మీడియా నుంచి దూరంగా ఉండు.. సినిమాకే హైప్ చాలు.. మాటలతో మిస్ ఫైర్ కావొద్దు” అంటూ క్లియర్గా చెప్పారట. విజయ్ కూడా దాన్ని 100% పాటించాడు. ఇంతవరకూ ఏ మీడియా ఇంటర్వ్యూకీ ఆయన కనిపించలేదు.
ఇది ఇప్పటి హీరోలకి చాలా అవసరం. ఎందుకంటే ఓ చిన్న స్టేట్మెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తుపానులా మారి, సినిమాకే నష్టం తేలుస్తుంది. ప్రత్యేకంగా విజయ్ లాంటి ఎగ్రసివ్ స్టయిల్ ఉన్న స్టార్స్కి ఇది మరింత అపాయింట్మెంట్. అందుకే ఈసారి విజయ్ బండి స్లో చేసాడు. అసలైన స్పీడ్ ఇవ్వాల్సింది మాత్రం హిట్ మాత్రమే. ఈసారి హిట్ రావడం అంటే ఇక విజయ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు అని తేలిపోయినట్లే. ఇక ముందుండే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉండబోతోంది. అక్కడ కూడా విజయ్ ఇదే కంట్రోల్ కొనసాగిస్తే, నాగవంశీ స్ట్రాటజీ ఫలించిందని చెప్పొచ్చు. ఫైనల్గా చెప్పాల్సిందే – రౌడీ ఇప్పుడు మేచ్యూర్ అయ్యాడు, మాటలతో కాకుండా, మూవీతోనే ఎఫెక్ట్ చూపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరి కోరిక కూడా అదే – “బాక్స్ ఆఫీస్ లో మళ్లీ రౌడీ ఊపు కావాలి!”