రిషబ్‌ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను రేపుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో నిర్మాత వై. రవిశంకర్‌ మాట్లాడుతూ “మా సినిమా చూసిన ముగ్గురు నలుగురు అందరూ ఒకే మాట చెబుతున్నారు… అద్భుతంగా ఉంది. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విశేష ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంద‌న్నారు. హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ గురించి మాట్లాడుతూ – “ఆమె ఎన్టీఆర్‌ సరసన నటించబోతుంది. అద్భుతమైన నటి. ఆమె నటన ఈ రెండు సినిమాల్లో ఆమె కెరీర్‌కు చాలా ప్ల‌స్ అవుతుంద‌న్నారు.


ఇక ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కలయికలో వస్తున్న భారీ చిత్రంపై కూడా నిర్మాత స్పష్టతనిచ్చారు. “మేము ప్రామిస్‌ చేసినట్టుగానే ఈ సినిమా అనుకున్న టైంకే వ‌స్తుంద‌న్నారు. కొత్త షెడ్యూల్‌ వచ్చే నెలలో మొదలవుతుంది. ఈ సినిమా పూర్తిగా వేరే స్థాయిలో ఉండబోతోంద‌ని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ ‘డ్రాగన్‌’ అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు ర‌వి బ్ర‌సూర్ సంగీతం అందిస్తున్నారు.


దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రత్యేకమైన మాస్‌ యాక్షన్‌ ట్రీట్మెంట్‌తో తెరకెక్కించబోతున్న ఈ ప్రాజెక్ట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కాంతార చాప్టర్‌ 1’తో రిషబ్‌ శెట్టి మరోసారి తన మైమరపించే నటనను చూపించబోతుండగా, ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లోని ‘డ్రాగన్‌’ మాత్రం ఇండియన్‌ సినిమాకి కొత్త బెంచ్‌మార్క్‌ సెట్‌ చేసే అవకాశం ఉన్న సినిమాగా ఇండస్ట్రీ టాక్‌ వినిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: