హైదరాబాద్ కి చార్మినార్ ఎంత ప్రాముఖ్యంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరబాద్ అనగానే అందరికి టక్కున గుర్తు వచ్చేది ఈ చార్మినార్. అదే విధంగా, హైదరాబాద్ లోని rtc X రోడ్ సినిమా థియేటర్లు కూడా సినిమా ప్రియుల హృదయానికి హాట్ స్పాట్ లాంటివే. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోనే సంధ్యాదేవి, సుదర్శన్, ఓడియన్ వంటి ఐకానిక్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. హైదరాబాదులో సినిమాల కి “కేర్‌ఆఫ్ అడ్రస్”గా పేరుపొందినవి ఇవే. ఈ సినిమా హబ్ దశాబ్దాలుగా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను సాధిస్తూ, సినిమా ప్రియుల కోసం ఒక ప్రత్యేకమైన ప్రీతికరమైన ప్రదేశంగా మారింది. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో 18 థియేటర్లు సక్సెస్ ఫుల్ గా సినిమా ప్రదర్శనలను కొనసాగిస్తున్నాయి. అయితే, ఇప్పుడు కొత్తగా రెండు మల్టీప్లెక్స్ రాబోతున్నాయి. దీని కారణంగా సోషల్ మీడియాలో ఈ ప్రాంతం సినిమా ఇండస్ట్రీలో మరింతగా ట్రెండ్ అవుతుంది.

ఒడియన్ మల్టీప్లెక్స్ 2025 అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్‌గా ప్రసిద్ధి చెందిన థియేటర్‌ను ఇప్పుడు ఎనిమిది స్క్రీన్లతో మల్టీప్లెక్స్‌గా అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో ప్రొజెక్షన్ సిస్టమ్, లగ్జరీ సిట్టింగ్, మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉండబోతున్నాయి. అంతేకాదు, లోపల షాపింగ్ మాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాయి. మరో మల్టీప్లెక్స్, ఏఎంబీ క్లాసిక్, 2026 సంక్రాంతి సందర్భంగా ప్రారంభం కానుంది. ఇది సుదర్శన్ 70MM కాంప్లెక్స్ ప్రదేశంలో నిర్మించబడుతుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో ఏడు కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో తొలి సినిమా ప్రదర్శన మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజా సాబ్ తో చిత్రంతో జరుగబోతోంది.

హైదరాబాదు సినిమా ప్రేమికులకు ఉత్సాహం కలిగే విషయం ఏమిటంటే, సింగిల్ స్క్రీన్‌ల నొస్టాల్జియాతో నిండిన ఈ ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక మల్టీప్లెక్స్ సంస్కృతిగా మారింది. లగ్జరీ ఎక్స్పీరియన్స్ అందించడం వల్ల, సినీ ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై గర్వంగా మరియు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. అందువల్ల, ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సినిమా థియేటర్ల సంఖ్య ఇప్పుడు 18 నుంచి 20కి పెరుగబోతోంది. ఇది సినీ ప్రియులకు వెరీ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి..!!
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: