టీజర్ లాంచ్ వేదికను ఒక మహోత్సవంలా మలచాలని రాజమౌళి బృందం ఆలోచన. భారీ సెట్లు, స్పెషల్ లైట్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సౌండ్ సిస్టమ్తో ఈ ఈవెంట్ను ఒక అంతర్జాతీయ ప్రమాణాల షోలా రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే, జనాల హాజరు విషయంలో మాత్రం జక్కన చాలా కఠిన నిర్ణయం తీసుకున్నాడట.సాధారణంగా మహేశ్ బాబు ఈవెంట్లకు లక్షలాది మంది అభిమానులు తరలి వస్తారు. కానీ ఈసారి భద్రతా కారణాల దృష్ట్యా, కేవలం 25 వేల మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. భారీ స్థాయి సెక్యూరిటీ, పోలీస్ బందోబస్త్, ప్రత్యేక పాస్ సిస్టమ్ ద్వారా మాత్రమే అభిమానులను అనుమతించనున్నారని తెలుస్తోంది.
అంత పెద్ద స్కేల్లో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్నందున, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో ఇప్పటికే #SSMB29 Teaser ట్రెండ్ మొదలైంది. జక్కన దర్శకత్వం వహిస్తే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మహేశ్ బాబుతో ఆయన కలయిక కావడంతో ఆ క్రేజ్ మరింత రెట్టింపైంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ టీజర్ విజువల్ గ్రాండ్ ట్రీట్గా ఉండబోతుందని, దాన్ని చూసినవారు “ఇది కేవలం టీజర్ కాదు, హాలీవుడ్ రేంజ్ మోషన్ పిక్చర్ ప్రామిస్” అని అంటున్నారని చెబుతున్నారు. మొత్తానికి, జక్కన ప్లాన్ చేస్తున్న ఈ 25 వేల మందితో జరిగే టీజర్ ఈవెంట్ టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. చూద్దాం, నవంబర్ 15న SSMB 29 టీజర్ ఎలా సెన్సేషన్ సృష్టిస్తుందో!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి