నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వరుసగా వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్‌లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీలు ఎప్పుడూ సెన్సేషన్‌గానే మారుతాయి. అలాంటి నేపథ్యంతో వస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రతిభావంతుడైన దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.  ముఖ్యంగా ‘హనుమాన్’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తన పూర్తి శ్రద్ధను మోక్షజ్ఞ ప్రాజెక్టుపైనే పెట్టిన్నట్లు సమాచారం.


సినిమా కథ సింపుల్ కాకుండా సరికొత్త కాన్సెప్ట్‌తో, రొమాంటిక్ టచ్ మరియు యాక్షన్ ఎమోషన్ మేళవింపుతో ఉండబోతుందని చిత్ర బృందానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి “సింబ” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా, సింబాలిక్‌గా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో ఫ్యాన్ పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. కొత్త లుక్‌లో ఆయన కనిపించిన తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి “ఇదే నెక్స్ట్ నందమూరి వారసుడు” అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకున్నారు. ఆ లుక్‌తోనే యువ హీరోగా మోక్షజ్ఞ తన స్థాయి చూపించాడు.



ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త ఏంటంటే — ఇందులో హీరోయిన్ మారిపోయిందట! మొదట ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల నటించనుందని వార్తలు వినిపించాయి. ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్‌గా రాణిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ పొజిషన్‌లో ఉన్న శ్రీలీల, నందమూరి మోక్షజ్ఞ సరసన నటిస్తే జంటగా బాగుంటుందనే అభిప్రాయం కూడా అందరిదీ. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం శ్రీలీల స్థానంలో మరో హీరోయిన్ ఎంపికయ్యిందట. ఈసారి మాత్రం ఇది నిజంగానే సంచలనమే! ఎందుకంటే మోక్షజ్ఞ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరో కాదు — బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని.



అవును, అదే రవీనా టాండన్! 90లలో బాలీవుడ్‌ను ఊపేసిన గ్లామర్ క్వీన్.  తాజాగా ‘కేజీఎఫ్ 2’లో ప్రధాన పాత్రలో నటించి మళ్లీ తన ప్రతిభను నిరూపించుకుంది. ఇప్పుడు ఆమె కూతురు రాషా థడాని టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతుందంటే అది నిజంగా సెన్సేషనే. రాషా ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని చిన్నపాటి యాడ్స్, ఫ్యాషన్ ఈవెంట్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, నందమూరి మోక్షజ్ఞ సరసన హీరోయిన్‌గా ఎంపిక కావడం టాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్ చాలా ఫ్రెష్‌గా, యువతను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. ఇక సమాచారం ప్రకారం రాషా ఇప్పటికే ఆడిషన్ ఇచ్చిందని, ప్రశాంత్ వర్మ ఆమె నటన, ఎక్స్‌ప్రెషన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారట. ఆమె ఎంట్రీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను గ్రాండ్‌గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: