ఐఎండిబి ప్రతినెల, ప్రతి ఏడాది కూడా టాప్ సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా 2025 వ సంవత్సరానికి గాను అత్యంత ప్రజాదారన పొందిన ఇండియన్ సినీ సెలబ్రెటీల జాబితాను ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ చెందిన వారు ఉన్నారు.. మరి కొంతమంది తమ మొదటి సినిమాలతోనే యువతను విశేషంగా ఆకట్టుకున్నవారు కూడా ఉన్నారు. అలా సైయారా సినిమాతో బారి పాపులారిటీ సంపాదించుకున్న బాలీవుడ్ యంగ్ హీరో ఆహన్ పాండే, హీరోయిన్ అనీత్ పడ్డ 2025 కు గాను IMDB లో అత్యధిక ప్రజాదరణ పొందిన భారతీయ సినీ తారల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.


మొదటి స్థానంలో అహన్ పాండే, రెండవ స్థానంలో అనీత్ పాండే నిలిచారు. ఆ తర్వాత స్థానాలు అమీర్ ఖాన్, ఇషాన్ ఖట్టర్, రష్మిక, లక్ష్య , కళ్యాణి ప్రియదర్శన్, త్రిప్తి దిమ్రి, రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి తర్వాతి స్థానాలలో ప్రజాదారణ జాబితాలో ఉన్నారు. అలాగే ఈ ఏడాది ప్రజాదారణ పొందిన భారతీయ దర్శకుల జాబితా విషయానికి వస్తే.. సైయారా సినిమా డైరెక్టర్ మోహిత్ సూరి మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఆర్యన్, ఆ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజు, నాలుగవ స్థానం అనురాగ్ కశ్యప్, ఐదవ స్థానం పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా మరి కొంతమంది దర్శకులు టాప్- 10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు.



IMDB లో తన తొలిచిత్రమే అత్యధిక ప్రజాదారణ పొందిన చిత్రంగా పేరు సంపాదించడంతో ఆహన్ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రమే ఈ ఏడాది అత్యంత ప్రజాదారణ గల భారతీయ తారల జాబితాలో నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు నా వృత్తి పట్ల నాకున్న బాధ్యతను మరింత గుర్తు చేస్తాయని తెలిపారు ఈ విషయంపై డైరెక్టర్ మోహిత్ సూరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. హీరోయిన్ అనీత్ పడ్డా మాట్లాడుతూ.. ఐఎండిబి జాబితాలో రెండవ స్థానంలో నిలవడం ఇప్పటికి నమ్మలేకపోతున్న.. నా జీవితాన్ని ఎన్నో విధాలుగా మార్చేసింది సైయారా ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానని తెలియజేసింది అనిత్ పడ్డా.

మరింత సమాచారం తెలుసుకోండి: