టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసి, నేషనల్ వైడ్ భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. స్టైలిష్ స్టార్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ‘పుష్ప: ది రూల్’ తర్వాత చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ హైప్ నెలకొంది.


సినిమా సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫాంటసీ అంశాలతో రూపొందుతున్నట్లు సమాచారం. కథ పరంగా కూడా ఇది ఇప్పటివరకు టాలీవుడ్‌లో రాని కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని టాక్. ఈ మూడు పాత్రలు మూడు వేర్వేరు షేడ్స్‌లో ఉండబోతున్నాయని, ఆయన కెరీర్‌లోనే ఇది ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు.ఇక హీరోయిన్‌ల విషయానికి వస్తే, ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారని టాక్ వినిపిస్తోంది. భారీ తారాగణం, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.



ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కథ డెప్త్, విజువల్ స్కేల్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అంతేకాదు, రాబోయే ఏప్రిల్ 8 న టైటిల్ టీజర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ రోజు బన్నీ పుట్టినరోజు. ఈ టీజర్‌ను ఆ ప్రత్యేకమైన రోజున రిలీజ్ చేసి అభిమానులకు గ్రాండ్ సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. టైటిల్ టీజర్‌తో పాటు సినిమాలోని కీలక పాత్రల లుక్స్ లేదా క్యారెక్టర్ రివీల్స్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.



మొత్తానికి అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా మార్కెట్‌లో కూడా భారీ రికార్డులు సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. టీజర్ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా, అప్పటివరకు ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: