కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా నియంత్రణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అటు తర్వాత భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సర్వదర్శనాని పునరుద్ధరించింది. మొదట ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు రోజుకు రెండు వేల చొప్పున టిక్కెట్లు జారీ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత 18వ తేదీ నుంచి రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు కేటాయిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు సర్వదర్శనం టోకెన్లు పొంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. అయితే టోకెన్లు జారీ కేంద్రం వద్ద నిత్యం తోపులాటలు చోటుచేసుకుంటుండటం, కొవిడ్ నిబంధనలు పాటించే పరిస్థితులు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలోనే సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్ లైన్లో భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. సర్వదర్శనానికి సంబంధించి ప్రతి నిత్యం 8వేల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 24వ తేదీన సర్వదర్శనం టోకెన్లను గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు ఆన్ లైన్లో కేటాయించింది. ఆన్లైన్లో భక్తులు సులభతరంగా టోకెన్లను పొందడంతో ఈ విధానం సక్సెస్ పుల్ అయ్యిందని భావించిన టీటీడీ.. రాబోయే రోజుల్లో కూడా శ్రీవారి దర్శన టిక్కెట్లు, టోకెన్లను ఆన్ లైన్లో కేటాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని సమాచారం.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా నియంత్రణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అటు తర్వాత భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సర్వదర్శనాని పునరుద్ధరించింది. మొదట ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు రోజుకు రెండు వేల చొప్పున టిక్కెట్లు జారీ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత 18వ తేదీ నుంచి రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు కేటాయిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు సర్వదర్శనం టోకెన్లు పొంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. అయితే టోకెన్లు జారీ కేంద్రం వద్ద నిత్యం తోపులాటలు చోటుచేసుకుంటుండటం, కొవిడ్ నిబంధనలు పాటించే పరిస్థితులు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలోనే సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్ లైన్లో భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. సర్వదర్శనానికి సంబంధించి ప్రతి నిత్యం 8వేల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 24వ తేదీన సర్వదర్శనం టోకెన్లను గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు ఆన్ లైన్లో కేటాయించింది. ఆన్లైన్లో భక్తులు సులభతరంగా టోకెన్లను పొందడంతో ఈ విధానం సక్సెస్ పుల్ అయ్యిందని భావించిన టీటీడీ.. రాబోయే రోజుల్లో కూడా శ్రీవారి దర్శన టిక్కెట్లు, టోకెన్లను ఆన్ లైన్లో కేటాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని సమాచారం.