ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ లోకి ప్రతిపక్ష నేతలు వెళ్ళడం సహజం.. ఇక ఏపీ లో అయితే ఈ చేరికల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అయితే జగన్ వీటికి చెక్ పెట్టె విధంగా రాజీనామా అనే అస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు.. దాంతో చాలామంది ప్రతిపక్ష నేతలు రాజీనామాలు చేయడం ఇష్టం లేక పార్టీ కి సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు వైసీపీ కి మద్దతు తెలుపుతూ తమ కుటుంబ సభ్యులను వైసీపీ లోకి చేర్చారు. అయితే ఇలా వచ్చిన వారు టీడీపీ పై ఘాటుగా విమర్శలు చేయడం ఇప్పడు సర్వత్ర సంచలనాన్ని రేకెత్తిస్తుంది..