అయితే ఈ విషయం పైన తీవ్రంగా స్పందించిన బుట్టా రేణుక, తన మీద కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఈ వ్యాఖ్యలను ఖండించింది. రాజకీయంగా తనని ఎదురుకోలేక ప్రజలలో తనకు ఉన్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. తనమీద ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసిన వారే రాబోయే రోజుల్లో ప్రజల ముందు నవ్వుల పాలవుతారు అంటూ ఆమె వ్యాఖ్యానించింది. 2019లో వైసీపీ పార్టీలో తిరిగి చేరిన తర్వాత ఎలాంటి ఆశలు పదవులు ఆశించకుండానే కేవలం పార్టీ కోసమే పనిచేశానట్టు తెలియజేసింది బుట్టా రేణుక.
ఇప్పుడు మళ్లీ తిరిగి పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానంటూ తెలిపింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తనకి ఉన్న అపారమైన నమ్మకం ఆయన న్యాయకత్వంలో పనిచేస్తూ కొనసాగించడమే తనకు నచ్చుతుందని తెలియజేసింది బుట్టా రేణుక. వైసిపి పార్టీని విడిచి వెళ్లాల్సి వస్తే అది తన రాజకీయ జీవితానికి చివరి రోజు అవుతుందంటూ ఆమె పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో తన మీద వస్తున్న అన్ని రూమర్స్ కి సమాధానాలకు ఇలా ఒక్క మాటతో చెక్ పెట్టేసింది. దీంతో వైసిపి కార్యకర్తలు, నేతలు కూడా సంబరపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి