శ్రీకాంత్ రెడ్డి తన అక్కసును టి.డి.పి నేత అయినటువంటి చంద్ర బాబు పైన వెళ్ళ గక్కారు. అవును. కొద్ది సేపటి క్రితమే.. మీడియా సమక్షంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై శ్రీకాంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెన్నుపోటు, హత్యా రాజకీయాలుకు చంద్రబాబు బ్రాండ్ అంటూ... మండిపడ్డారు. ప్రజలు చిత్తుగా ఓడించారు.. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చెందనీయకూడదనే కక్షతో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. మీ నీచ రాజకీయాలకోసం అనేక అరాచకాలు చేసారంటూ చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు.

 

చంద్రబాబు హయాంలో టిడిపి నేతలు లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. చంద్రబాబు,లోకేష్‌ దోపీడీలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు శ్రీకాంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉండికూడా అరాచకాలు చేస్తున్న మీరు మా గురించి మాట్లాడతారా? అంటూ చంద్రబాబును నిలదీశారు. మీలాగా మేం పోలీసులకు పచ్చచొక్కాలు తొడగలేదన్నారు. గ్యాంగ్‌ స్టర్లు రేపిస్టులు,ఫ్యాక్షనిస్టులు అందరూ టిడిపి లోనే ఉన్నారంటూ మండిపడ్డారు. 

 

నెగిటివ్‌ పబ్లిసిటీ చేస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. మీ బండారాలన్నీ కూడా త్వరలోనే బయటపెడతామన్నారు. చింతమనేని కూనరవి లాంటి వాళ్ళు ఇప్పటికీ చెలరేగిపోతున్నారని విమర్శలు గుప్పించారు ప్రభుత్వ విప్. 45 సంవత్సరాల యువకుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే తపనతో పనిచేస్తున్నసీఎం జగన్‌ ఆహ్వానించకపోగా కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. 

 

పారదర్శకంగా సాగుతున్న జగన్‌ పరిపాలనచూసి ఓర్వలేకపోతున్నారన్నారు. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవినీతికి ఆమడదూరంలో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఐదేళ్ల పాటు మాఫియా పాలన సాగించారన్నారు. బాబులో అసహనం పెరిగి, పిచ్చెక్కి ఈ రకంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు మీ బూటక రాజకీయాలను నమ్మరని మీడియా సాక్షిగా కడిగేశారు. ఈ సారి గాని ఎన్నికలు జరిగితే టీడీపీకి ఒక్క సీటు కూడా రాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: