కలెక్షన్ కింగ్ మోహన్ బాబు  వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరో మంచు మనోజ్. పలు చిత్రాల్లో డూప్ లేకుండా ఎన్నో సాహసాలు చేసి రియల్ హీరోగా  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు మంచు మనోజ్. మొన్నటికి మొన్న తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాల కోసం సిద్ధమవుతున్నాను అంటూ మంచు మనోజ్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన సినిమా అప్డేట్ ని  కూడా ప్రకటించాడు మంచు మనోజ్. మూడు సంవత్సరాలు భారీగా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఇప్పుడు అహంబ్రహ్మాస్మి అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 


 ఇదిలా ఉంటే... ప్రస్తుతం మంచు మనోజ్ తన తాజా చిత్రంలో బాలకృష్ణను ఫాలో అవుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎందుకంటే మూడేళ్ల గ్యాప్ తర్వాత అహం బ్రహ్మాస్మి సినిమాలో నటిస్తున్న మంచు మనోజ్... ఈ చిత్రంలో అఘోరా పాత్రలో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా  మంచు మనోజ్ పాత్ర ఈ సినిమాలో కీలకంగా మారిపోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా బాలకృష్ణ  అఘోరా పాత్రలో కనిపించబోతున్నారని  గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కాంపౌండ్ లో గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 

 


ఈ నెలాఖరులోనే కాశీలో బాలయ్య అఘోర గెటప్ కు సంబంధించిన సీన్స్ మొదలు కానున్నాయని సమాచారం. కాగా బాలకృష్ణ సినిమాలో అఘోరా  పాత్రకు సంబంధించిన సీన్స్ 15 నిమిషాలు ఉండబోతున్నాయని..ఇవి సినిమాకే కీలకంగా మారుతుందని సమాచారం. మంచు మనోజ్ కూడా అఘోర పాత్రలో నటిస్తుండడం... మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఓ వైపు బాలకృష్ణ మరో వైపు మంచు మనోజ్ నటించిన సినిమాల్లో  ఈ ఏడాదే విడుదల కానున్నాయి... అయితే అఘోర పాత్రలో ఇద్దరు హీరోలు ప్రేక్షకులను మెప్పిస్తారు  అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: