ఎన్నికల ప్రచారంలో సినీ తారలకు ఉండే క్రేజే వేరు. దీన్ని క్యాష్‌ క్యాష్ చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ స్టార్లతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాయి. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అలా..  ప్రచారానికి వెళ్లిన తనకు భయానక అనుభవం ఎదురైందట. తృటిలో అత్యాచార, హత్య నుంచి తప్పించుకుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు అమీషా పటేల్.  

ఓబ్రా నియోజకవర్గం నుంచి లోక్‌ జనశక్తి పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రకాశ్ చంద్రపై సంచలన ఆరోపణలు చేసింది నటి అమీషా పటేల్‌. ప్రకాశ్ చంద్ర కోసం ప్రచారానికి వెళ్లగా.. భయానక అనుభవం ఎదురైందని వివరించింది అమీషా పటేల్‌. తనను అత్యాచారం చేసి చంపేసేవారేమోనని.. ఇప్పుడు కూడా బెదిరింపులు కొనసాగుతున్నాయని  చెప్పింది.

అసలు విషయం ఏంటంటే..ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ప్రకాశ్ చంద్ర.. అమిషా పటేల్‌ను సంప్రదించారు. ఆమె బీహార్‌లో ప్రచారం కూడా చేసింది. చివరి రోజైన 26న ప్రచారం కోసమని అతని అనుచరులు అమిషా పటేల్‌ను ఓ గ్రామానికి తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రమే ముంబైకి రిటన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉన్నా, తనను కదలనీయలేదని అమిషా పటేల్ ఆవేదన వ్యక్తం చేసింది. కారులో వెళ్లనీయకుండా.. ఓ ఇంట్లో బంధించారని, రాత్రికి అక్కడే ఉండాలని, కాసేపట్లో వచ్చేస్తానని ప్రకాశ్ చంద్ర ఫోన్లోనే బెదిరించారని తెలిపిందామె. ఒక నేతలా కాకుండా అచ్చమైన రౌడీ లాగా అతను వ్యవహరించాడని ఆరోపించింది. అయితే, హీరోయిన అమిషా పటేల్ చేసిన ఆరోపణలను ఖండించారు ప్రకాశ్ చంద్ర.

అమీషా పటేల్ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. తనను అత్యాచారం.. చంపేసే వారేనని.. ఆ ప్రమాదం నుంచి తాను తప్పించుకున్నానని ఆమే స్వయంగా ప్రకటించడంతో ఆ వార్తలే ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. కానీ ప్రకాశ్ చంద్ర మాత్రం అదంతా నిజం కాదని చెబుతున్నాడు.మరి ఏది నిజమే వారిద్దరికే తెలియాలి.







మరింత సమాచారం తెలుసుకోండి: