అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపు అదే పరిస్థితి లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చినా సరే పరిణామాలు మాత్రం సీఎం కేసీఆర్ కి బాగానే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
త్వరలోనే పార్టీ శాసనసభ పక్ష అదేవిధంగా పార్లమెంటరీ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు అందరిని కూడా ఆహ్వానించి బిజెపిని ఎదుర్కొనే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి ఏంటి అనేది ఆయన సూచనలు చేస్తున్నారు. త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా ఇప్పుడు ఆయన దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు. మరి బిజెపి ని సీఎం కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాలి. వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి.