ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో కేరళలో విజయం సాధించాలి అనుకున్న బిజెపి... సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేరళలోని క్రిస్టియన్, ముస్లిం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఉండగా ఇక ఇప్పుడు విద్యావంతులను తెర మీదకు తెచ్చేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడి సామాజిక వర్గాలు కాంగ్రెస్ కమ్యూనిస్టుల వైపు పూర్తిగా ముగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది విద్యావంతుల తో రంగంలోకి దిగుతుంది బిజెపి.
ఇటీవలే మెట్రో చీప్ శ్రీధరన్ లాంటి వాళ్లు వచ్చి బిజెపిలో చేరడం ఆసక్తికరంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు.. లేటెస్ట్ గా కేరళ హైకోర్టు మాజీ జడ్జి సురేంద్ర కేరళ, మాజీ డిజిపి వేణుగోపాలన్ కూడా బిజెపిలో జాయిన్ కావడం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం కూడా మొదలుపెట్టారు. ఇలా విద్యావంతుల ప్రాంతమైన కేరళలో విద్యావంతులనే రంగంలోకి దింపి ఇక ఓట్లు సంపాదించాలి అని బీజేపీ సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.