వివరాల్లోకి వెళితే..మ్యాట్రీమోనీ సైట్లలో డీటైల్స్ పెట్టడం చాలా కామన్. అలాంటి వారి సమాచారం తీసుకొని.. కేటుగాళ్లు మాయ చేయడం గమనార్హం. తాజాగా.. ఓ యువకుడి సమాచారాన్ని మ్యాట్రిమోని సైట్ల నుంచి సేకరించి.. అతనికి ఓ అమ్మాయి తో ఎరవేసి.. రూ.లక్షలు గుంజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.. మెట్ట గుడాకు చెందిన విక్రమ్ అనే యువకుడి కి ఇటీవల ఓ విదేశీ ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. తన పేరు పమేలా బిందే అని, యూకే లో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అంటూ నమ్మించింది.
నీకు అంగీకారమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది, పెళ్లి కూడా ఇండియా లోనే చేసుకుందామని, ఖర్చులు, ఇతరత్రా కోసం కోట్ల లో డబ్బులు పంపిస్తామని నమ్మించి, తన పనిని కానించ్చింది.తర్వాత ఎయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి యువకుడి నుంచి రెండు దఫాలు గా రెండు లక్షల కు పైగా డబ్బును ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఫోన్లు స్విచ్చాఫ్ వస్తుండటం తో మోసపోయాన ని తెలుసుకొని సైబర్ పోలీసుల ను ఆశ్రయించారు.. అతని వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఇటువంటి మోసాలను నమ్మి మోస పోవద్దని హెచ్చరించారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి