
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం లిపోసోమల్ ఆంఫొటెరిసిన్ బి, పొసకొనజోల్’, ఐసవుకొనజోల్ వంటి మందులు వాడతారు. ఇవి యాంటీ ఫంగల్ ఔషధాలు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఈ మందులు అవసరం. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ వస్తోంది. క్రమంగా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆ మందులకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. సాధారణంగానే మన బ్లాక్ మార్కెటింగ్ మాయగాళ్లు ఈ మందులను అప్పడే బ్లాక్ మార్కెట్కు తరలించేశారు.
అందుకేఈ మందులు షాపుల్లో దొరకడం లేదు. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొన్ని ఆసుపత్రులకు ప్రధాన డీలర్లకు చేరుతున్నాయి. ఈ మందులెన్ని వస్తున్నాయో.. ఎన్ని ఎవరెవరికి ఇస్తున్నారనే కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద కూడా లేదు. ఇప్పుడు ఈ మందుల కోసం విజ్ఞప్తులు పెరగడంతో ప్రభుత్వం దీనిపై ఓ విధానం ఉండాలని భావించింది. ఈ మందుల వాడకం, నియంత్రణపై నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో వైద్యవిద్య సంచాలకులు, కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి ఈఎన్టీ విభాగాధిపతి సభ్యులు.
ఇకపై బ్లాక్ ఫంగస్కు ఈ యాంటీ ఫంగల్ ఔషధాలు అవసరమని వైద్యుడు ప్రిస్కిప్షన్లో రాస్తే.. దాన్ని జతచేస్తూ ప్రత్యేక దరఖాస్తు పత్రాన్ని నిపుణుల కమిటీకి పంపించాలి. నిపుణుల కమిటీ పరిశీలించి కొనుగోలుకు అనుమతిస్తుంది. ఏ స్టాకిస్టు వద్ద నుంచి మందు దొరుకుతుందో కూడా కమిటీ చెబుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ మందుల కోసం dme@telangana.Gov. , ent-mcrm@telangana.gov.in కు ఈ మెయిల్ చేయాలి. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్లో పంచుకున్నారు.