అంతకు ముందు వైసీపీ నుంచి రెడ్డి నేతలే ఎక్కువుగా రాజ్యసభకు వెళ్లడంతో జగన్ ఆ విమర్శను పోగొట్టేందుకు మొన్న టర్మ్ లో రెండు రాజ్యసభ పదవులు బీసీలకే ఇచ్చారు. చంద్రబాబుతో పోలిస్తే ఈ విషయంలో జగన్ చాలా డేరింగ్ నిర్ణయం తీసుకుని ప్రశంసలు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ టార్గెట్ కాపులే అని తెలుస్తోంది. కాపు కోటాలో మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం ఎలా ఉన్నా కాపు కోటాలో జగన్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును రాజ్యసభకు పంపుతారని పార్టీలోనే మరో వర్గంలో వినిపిస్తోన్న టాక్ ?
ఇటీవలే ఉమ్మారెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసింది. మరోసారి ఆయనకు ఆ పదవే కట్టబెడతారని అందరూ అనుకున్నారు. అయితే ఈ పదవిని కాపుల్లో సీనియర్ నేతగా ఉన్న ఉమ్మారెడ్డికే ఇచ్చే ఆలోచన పార్టీ కీలక నేతలు, జగన్ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మారెడ్డి సీనియర్ నేతే.. ఆయనకు మంచి వాయిస్ ఉంది. అయితే ఈ వయస్సులో ఆయనకు ఈ పదవి ఇస్తే ఎంత వరకు కరెక్ట్ అన్నది జగన్ ఆలోచించుకోవాలని కూడా పార్టీలోనే కొందరు రుసరుసలాడుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఏంటో ?