ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరియు నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు మధ్యన ఉన్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. జగన్ కారణంగా రాజకీయ పదవి దక్కక పోవడంతో రఘురామ రాజు ప్రభుత్వంపై మరియు వైసీపీపై మొదటి నుండి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ వ్యాఖ్యల పరంపర ఎంత దూరం వెళ్లిందంటే కులం పరంగా, మతం పరంగా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడే స్థాయికి వెళ్ళింది. అయినప్పటికీ జగన్ నోరెత్తి ఒక్క మాట కూడా అనకపోవడం ఆశ్చర్యకరం. కానీ పార్టీలోని ఎమ్మెల్యే లు అలాగే ఇతర నాయకులు మాత్రం ఎప్పటికప్పుడు కౌంటర్ లు ఇస్తున్నా, కొన్ని మీడియా సంస్థలు మరియు టీడీపీ మద్దతుతో రఘురామ రాజు ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు.

అయితే వీటన్నింటికీ కారణం అయిన జగన్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని భావించిన రఘురామ, జగన్ కు అక్రమాస్తుల కేసుల విషయములో ఇచ్చిన బెయిలును రద్దు చేయమని పిటిషన్ వేయడం జరిగింది. ఇది అలా అలా వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇది నిన్న కోర్టులో విచారణకు వచ్చింది. రఘురామరాజు ఎలాగైనా జగన్ ను మళ్లీ జైలుకు పంపాలని కంకణం కట్టుకుని ఉన్నారు. ఈ విషయంలో సీబీఐ సమాధానం కీలకం అని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కోర్టు సీబీఐని అడుగగా, సీబీఐ తుది నిర్ణయాన్ని కోర్టు కే ఇచ్చివేసింది. అయినా పదే పదే రఘురామ రాజు తరపు లాయర్ సీబీఐ ఈ విషయంలో వారి నిర్ణయాన్ని చెప్పాల్సిందే అని పట్టు బట్టుకుని కూర్చున్నారు. ఈ విషయాన్ని కోర్టు పలు మార్లు అడిగినా, సీబీఐ మాత్రం ఈ విషయంలో ఒకే స్టాండ్ తీసుకుని కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సబబేనని చెప్పకనే చెప్పింది.

దీనితో కోపోద్రిక్తులైన రఘురామ లాయర్ మాత్రం సీబీఐ పై ఒత్తిడి తెస్తూ ఉండడం గమనించాల్సిన విషయం. జగన్ బెయిల్ ను రద్దు చేయాల్సిన అవసరం రఘురామరాజుకు ఉండొచ్చేమో కానీ, సీబీఐ కి ఉండదు కదా. అయినా జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్ రద్దును కోరడమైనది. అయితే ఈ కేసులన్నీ కూడా రాజకీయంగా పెట్టినవే అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రఘురామ రాజు తరపు లాయర్ సిబిఐ పై ఈ విధమైన ఒత్తిడి తీసుకురావడం కారణంగా జగన్ బెయిలు రద్దు విషయంలో కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ముందు ముందు ఏ విధమైన పరిణామాలు జరగనున్నాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: