మరోవైపు జగన్ బలహీనతలను ఆసరాగా చేసుకొని కేంద్రం కూడా ఆడుకుంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పటికీ ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు స్పష్టం చేసింది. గతంలో ఎన్డీయే లో కీలక భాగస్వామి గా ఉన్న టిడిపి సైతం ప్రత్యేక హోదా విషయంలోనే బీజేపీతో విభేదించి బయటకు వచ్చింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ వైసిపి సరైన పోరాటం చేయడం లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఏపీలో వైసీపీ - టిడిపి రాజకీయంగా బద్ద శత్రువులు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా, పోలవరం పనులు చేసినా.. పోరాటం చేసిన వైసిపి తీవ్రంగా విమర్శించింది.
ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక హోదా , పోలవరం గాలికొదిలేసిన పరిస్థితి ఉంది. పైగా ఏపీకి సరైన రాజధాని అంటూ లేకుండా పోయింది. ఏపీలో టిడిపి - వైసిపికి రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అన్న విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి తో ఆటలు ఆడుకుంటోంది. అంతిమంగా టిడిపి మీద వైసిపి... వైసిపి మీద టిడిపి చాడీలు చెప్పుకుంటూ ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. ఆసరాగా చేసుకొని కేంద్రం చోద్యం చూస్తూ కాలం గడిపేస్తోంది. కేంద్రం కూడా భారతదేశ పటంలో ఏపీ అన్న రాష్ట్రం ఉందన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ పట్టించుకునే పరిస్థితి లేదు.