ఇక ఇప్పుడు మరో ఉప ఎన్నికకు రెడీ కావాల్సిన సమయం వచ్చేసింది. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోని బద్వేల్ ఎస్సీ రిజర్వ్ డ్ అసెంబ్లీ సెగ్మెంట్ కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. కరోనా లేకపోతే ఈ పాటికే తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు బద్వేల్కు కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వచ్చే నెలలో బద్వేల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ నే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈ ఓబులాపురం రాజశేఖర్ డాక్టర్ వెంకట సుబ్బయ్య చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఉప ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేయనున్నారు. అయితే ఆయన చంద్రబాబుకు పోటీ చేయాలంటే ఓ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే 2024 ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుందని.. కోరగా చంద్రబాబు సైతం ఇందుకు ఓకే చెప్పారనే అంటున్నారు.
ఒక వేళ ఈ ఉప ఎన్నికల్లో తాను ఓడిపోయినా.. 2024 ఎన్నికలలో తనకు సానుభూతి కలిసి వస్తుందన్న కోణంలోనే ఆయన ఈ షరతు పెట్టారని అంటున్నారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో టీడీపీకి గెలుపుపై ఆశలు లేవు. టీడీపీ ఖాతాలో మరో ఓటమి పడినట్టే..?