తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్‌ సర్కార్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎంత మంది నాయకులు పోయి న కాం గ్రెస్ పా ర్టీకి కార్యకర్తలే బలమని...  గల్లీలో కార్యకర్తలు కష్టపడితేనే ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి దోచుకుంటున్నాయని...  బీజేపీ, టి.ఆర్.ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి.  రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. వరి వేస్తే ఉరే అని సీఎం సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని....  రైతుల పక్షాన కాంగ్రెస్ పా ర్టీ పోరాడు  తుందని స్ప ష్టం చే శారు రేవంత్‌ రెడ్డి.  

కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ రెండు రోజుల సదస్సు అని తెలిపారు రేవంత్‌ రెడ్డి.  క్రమ శి క్షణ కాం గ్రెస్ లో ముఖ్యం.. క్రమశిక్షణ తప్పి తాగుబోతు సీఎం మాటలు నిజం చేయొద్దని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి.  మేము పదవులు అనుభవిస్తున్నాం అంటే కార్యకర్తల వల్లేనని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి.  కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా.. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని తేల్చి చెప్పారు రేవంత్‌ రెడ్డి.  

తెలంగాణ తల్లి సీఎం ఫామ్ హౌజ్ లో బందీ అయ్యిందని కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని తెలిపారు రేవంత్‌ రెడ్డి.  పదవులు అనుభవించి పార్టీ మారిన వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం వెల్లడించారు రేవంత్‌ రెడ్డి.  తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మరియు నేతలు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని కుండ బద్దలు  కొట్టారు రేవంత్‌ రెడ్డి.2023 ఎన్నికల్లో వచ్చేది తమ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: