గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరెంటు రాజకీయం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జనగామ, భువనగిరిలో జరిగిన బహిరంగసభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ కేంద్రాన్ని ఉద్దేశిస్తూ పలు సంచలన విమర్శలు విసిరారు. కాగా తాజాగా కేంద్రం అందుకు ప్రతి విమర్శలను వెదజల్లుతూ స్పష్టమైన ప్రకటన ఒకటి ఇచ్చింది. అటు తెలంగాణ రాష్ట్రం ఇటు కేంద్రం కరెంటు మీటర్ ల గోల పీక్స్ కు చేరగా... కేంద్రం ఈ అంశంపై స్పందించిన విధానం వైరల్ గా మారింది. కేసీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన కేంద్రం అదే రేంజ్ లో పవర్ఫుల్ వ్యాఖ్యలు చేసింది.

సిఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై మాట్లాడుతూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ ఫుల్ క్లారిటీ ఇచ్చే దిశగా అపోహలు - వాస్తవాలు పేరిట కేంద్రమంత్రి ఆర్‌.కె.సింగ్‌ అంటూ అధికారకంగా ఒక ప్రకటన విడుదల చేసింది.  నేరుగా తెలంగాణ సీఎం ను టార్గెట్ చేస్తూ కరెంట్ మీటర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.  విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని, వ్యసాయ బోర్లు, ఇలా వీటన్నింటి నెత్తిపై పిడుగు వేసిందని ఆరోపణలు చేశారు గులాబీ నేత.  కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలు కనుక దృష్టిలో ఉంచుకుని అమలు చేయగలిగితే  పౌల్ట్రీలు, లాండ్రీలు దళితులకు విద్యుత్‌ రాయితీలు ఇచ్చే అవకాశమే ఉండబోదని చెప్పుకొచ్చారు.

వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టమని ఏ రాష్ట్రాన్ని కూడా బలవంతం చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అనవసరంగా కేంద్రాన్ని టార్గెట్ చేయడం వలన ఒరిగేది ఏమి లేదని రాష్ట్రానికి సహకరిస్తు కేంద్రానికి బలంగా మారితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రా లను బట్టి వారి వినియోగాలను బట్టి విద్యుత్ ను కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఒక మాటలో చెప్పాలి అంటే ఆయా రాష్ట్రాలను బట్టి ఎంతగానో యోచించి ఒక ప్రణాళిక ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: