మన దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ప్రజల్లో గుర్తింపును సొంతం చేసుకున్న రాజకీయ పార్టీలు తక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే. కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా ఈ పార్టీ అత్యంత ధనిక రాజకీయ పార్టీగా ఉంది. గడిచిన 17 సంవత్సరాలలో బీజేపీకి ఏకంగా 8251 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి.

ఇదే సమయంలో  కాంగ్రెస్ పార్టీకి మాత్రం  1951 కోట్ల రూపాయలు విరాళంగా  తృణమూల్ కాంగ్రెస్ కు  1705 కోట్ల రూపాయలు దక్కగా బీజేడీ పార్టీకి  1019 కోట్ల రూపాయలు, డీఎంకే  పార్టీకి 676 కోట్ల రూపాయలు  విరాళాల రూపంలో దక్కాయి. ఈ మొత్తం ఒకింత భారీ మొత్తం అని  చెప్పడంలో సందేహం అవసరం లేదు.  తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ జాబితాలో  వైసీపీ తోలి స్థానంలో ఉండటం  గమనార్హం.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వైసీపీకి  503 కోట్ల రూపాయలు  విరాళంగా దక్కగా  బి.ఆర్.ఎస్ కు  383 కోట్ల రూపాయలు విరాళంగా దక్కాయి.  ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నా  టీడీపీ  మాత్రం  320 కోట్ల రూపాయలు మాత్రం  విరాళంగా దక్కింది.   ఈ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

వైసీపీ, టీడీపీ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.   రాష్ట్రంలో   ఈ రెండు రాజకీయ పార్టీలకు మాత్రమే  అధికారం దక్కుతోంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ఎంతో  కష్టపడుతోంది. జగన్ రాష్ట్రంలో ఎన్నికల ముందు పాదయాత్ర  చేస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే.  జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp